టి20 ప్రపంచకప్ సూపర్8 పోరులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూప్1 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 28 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 100 పరుగులు సాధించింది. ఈ సమయంలో వర్షం రావడంతో ఆట ముందుకు తగ్గలేదు. తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఫలితాన్ని తేల్చారు. ఇందులో ఆస్ట్రేలియా ఘన విజయం అందుకుంది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్‌లు శుభారం అందించారు.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours