నీట్ పరీక్షలో అక్రమాలు, యుజిసి-నెట్ రద్దుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మానసికంగా కుప్పకూలిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ తరహా ప్రభుత్వాన్ని నడపడానికి అష్టకష్టాలు పడతారని రాహుల్ వ్యాఖ్యానించారు. గురువారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ విద్యా సంస్థలను కబ్జా చేయడమే పేపర్ లీకులకు ప్రధాన కారణమని ఆరోపించారు. ఆ పరిస్థితి మారనంత వరకు ప్రశ్నా పత్రాల లీకులు ఆగబోవని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మోడీ మౌలిక భావనను ప్రతిపక్షాలు ధ్వంసం చేశాయని, వినమ్రంగా ఉండే అటల్ బిహారీ వాజ్‌పేయి లేదా మన్మోహన్ సింగ్ వంటి ప్రధాని ఉండి ఉంటే ప్రభుత్వం మనుగడ సాగించి ఉండేదని రాహుల్ చెప్పారు. ఆసక్తికరమైన రోజులు ముందున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.


Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours