మాస్కో: రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారు. చర్చిలు, యూదుల ప్రార్థనమందిరం, పోలీసుల పోస్టుపై సాయుధులైన మిలిటెంట్లు తుపాకులతో కాల్పులు జరపడంతో 15 మంది పోలీసులు మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. మఖచ్‌కల, డెర్బెంట్ నగరాల్లోని చర్చిలు, ప్రార్థనామందిరాలను మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడినట్టు సమాచారం. వెంటనే రష్యా భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆరుగురు మిలిటెంట్లను కాల్చి చంపాయి. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని జాతీయ ఉగ్రవాద నిరోదక కమిటీ ప్రకటించింది. ఈ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండడంతో గతంలో కాల్పులు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

Share To:

Demo Admin

Post A Comment:

0 comments so far,add yours